మానవ జనాభా విస్ఫోటాననికి సైన్స్‌ కారణమా..? | Sakshi
Sakshi News home page

Amarnath Vasireddy: మానవ జనాభా విస్ఫోటాననికి సైన్స్‌ కారణమా..?

Published Sat, Aug 20 2022 10:14 PM

amarnath vasireddy comments on population - Sakshi

1950 - 2020 

యుద్ధాలు , కరువు కాటకాలు , అంటు రోగాలు - మానవ జాతి చరిత్ర లో అది   ప్రాంతమైనా కాలమైనా మరణాలు ఎక్కువగా సంభవించేవి .

ఒకప్పుడైతే వైద్య  సదుపాయాలు కూడా పెద్దగా ఉండేవి కావు . గర్భస్థ దశలోనే  మరణించే శిశువులు , పుట్టినా అంటు రోగాలతో , పోషకాహార లోపాలతో మరణించే వారు ....

ప్లేగు , కలరా లాంటి అంటు రోగాలు కరువులు , యుద్ధాలు ..... వెరసి  మరణాలు నిత్యకృత్యాలు.

సగటు జీవనాయుర్దాయం 40 - 50.

 అరవై ఏళ్ళు బతికితే అదో పండుగ .

 పుట్టిన పది మందిలో తొమ్మిది మంది లోపే పోయేవారు .

 20 శతాబ్దంలో  సైన్స్ అభివృద్ధి చెందింది. వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం యుద్ధం లాంటి చిన్న  యుద్ధాలు జరిగిన మాట వాస్తవం. కానీ గతం తో పోలిస్తే యుద్ధాల సంఖ్యమరణాలు  రెండూ తక్కువే .

బహుశా మానవ జాతి చరిత్ర లో 1950 - 2020 కాలం అత్యంత శాంతియుత కాలం . మరణాలు తక్కువ .

హరిత విప్లవం లాంటి  వాటి  వల్ల తిండికి కొరత లేకుండా పోయింది . ప్రపంచం లోని వివిధ దేశాలు సంక్షేమ పథకాలు అమలు చేసి తిండికి పెద్దగా కొరత లేకుండా చేసాయి (కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రం...  పాపం .. ఇంకా అదే స్థితి )

1950లో   ప్రపంచ జనాభా 250  కోట్లు . ఇప్పుడు 800  కోట్లు . అంటే 70 ఏళ్లలో ప్రపంచ జనాభా మూడు రెట్లు దాటి పెరిగింది

అటుపై గేట్ల తాత రంగంలోకి దిగాడు . మానవ జనాభా విస్ఫోటాననికి కారణం సైన్స్ . ముల్లును ముల్లుతోనే తీయాలి అనేది అతని పద్దతి ... మరో వందేళ్లకు మన వారసులు చరిత్ర పుస్తకాల్లో (పుస్తకాలూ ఉండవు.. క్లౌడ్స్ .. వెబ్ పేజీ లు .. ఇంకా ఇలాంటివి) ఇలాంటి పాఠాన్ని చదువుతారేమో .

అన్నట్టు ఇప్పుడు అన్ని వేరియెంట్లకు కలిపి ఒక కొత్త బూస్టర్ వస్తోంది . అంటే నిన్నటి దాకా ఇచ్చిన బూస్టర్ పనికిరానిదా ?

టీకాలపైనా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక సంఘం కోర్ట్ ను ఆశ్రయించింది . గత వారం రోజుల్లో నేను కనీసం మూడు వీడియో లు / పోస్ట్ లు చూసాను . డాక్టర్లే టీకాల అసలు బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు . మరి ఎవరి పై కేసులు పెడుతుందో సంఘం !

సైన్స్ అంటే ప్రశ్నించే  తత్వాన్ని ప్రోత్సహించాలి . పరీక్షకు నిలవాలి . అంతే కానీ మేము ఏమి చెప్పినా ఎవరూ ప్రశ్నించకూడదు .. గుడ్డిగా మేము చెప్పిందే వినాలి అంటే ?

ఇది సైన్స్  కాదు . మధ్య యుగం నాటి మతం .

పోనీ ఒక పని చెయ్యండి . ఊరూరా ఉచిత టెస్టింగ్ కేంద్రాలు పెట్టండి . ఇంటింటికి తిరిగి బలవంతంగా సూదులు   పొడిచినట్టే అందరికీ టెస్ట్ చేయండి . సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే బాధ్యత వహించాలి . లేదని గ్యారంటీ ఇవ్వాలి .

దాన్ని తయారు చేసినవాడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడు. ఎవడో వచ్చి పొడిచిపోతాడు . ఎవడైనా పొతే దానికి గాలి నీరు నిప్పు కారణం అని బొంకులాట

జనాల అజ్ఞానికి అంతం లేదు .

ప్రపంచం మరో వందేళ్లల్లో ఎంత జనాభా భారాన్ని తగ్గించుకోనుందో .


- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు

Advertisement
Advertisement