
సత్తా చాటిన మానస విద్యార్థులు
భీమడోలు: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమడోలు మానస ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని ప్రిన్సిపాల్ యలమర్తి రవీంద్రకుమార్ తెలిపారు. విద్యార్థులు అత్యధికంగా రామిశెట్టి నాగ మణికంఠ 592 మార్కులు, జే.రేవంత్ 590, బండారు యశస్విని 586, రంకిరెడ్డి యోగేష్శ్రీ 582, బొమ్ము నాగలక్ష్మీకుమార్ 581, మేడపాటి దివ్య 579, పెరీం మానస 579 మార్కులు సాధించినట్లు చెప్పారు. మొత్తం 139 మంది పరీక్షలకు హాజరు కాగా 138 మంది ఉత్తీర్ణులయ్యారని, వీరిలో 38 మందికి 550 మార్కులకు పైగా సాధించారని, 84 మంది 500కు పైగా సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి రామిశెట్టి నాగ మణికంఠ, వారి తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం దుశ్శాలువాతో సత్కరించింది. రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.