రొయ్యల ఫీడ్‌ ధరలను తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రొయ్యల ఫీడ్‌ ధరలను తగ్గించాలి

Apr 24 2025 8:24 AM | Updated on Apr 26 2025 4:26 PM

పాలకోడేరు: రొయ్యల ఫీడ్‌ ధరలు కేవలం రూ.4 తగ్గించడం సబబుకాదని, రూ.20 తగ్గించాలని పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ఎన్‌ గజపతిరాజు, కార్యదర్శి జీకేఎఫ్‌ సుబ్బరాజు, రైతులు డిమాండ్‌ చేశారు. బుధవారం గొల్లలకోడేరులో నిర్వహించిన జిల్లా సమావేశంలో రైతులు మాట్లాడుతూ రొయ్యల కొనుగోలులో 60–50కి 50–40కి 40–30కి ఇదివరకు ఉన్న శ్లాబులను మళ్లీ పునరుద్ధరించాలని, అలాగే జోన్లు, ఎకరాలతో సంబంధం లేకుండా 1.50కి సబ్సిడీతో కూడిన కరెంటుని తక్షణమే క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కోరారు. 

అప్సడా వైస్‌ చైర్మన్‌ రమణారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ధరల స్థిరీకరణ 10 రోజులకీ జరిగినప్పటికీ ఈ మిగతా మూడు అంశాల్లో రైతులకి న్యాయం చేకూరాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించరని యెడల మే 10న జరగనున్న సమాఖ్య సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో వీరవాసరం మండలం తులసి రాంబాబు, ఆకివీడు మండలం బుజ్జి, ఇరగవరం మండలం బుజ్జి, గణపవరం మండలం వినాయక, నిడమర్రు మండలం నాని, ఆక్వా రైతు సోదరులు పాల్గొన్నారు.

రొయ్యల ఫీడ్‌ ధరలను తగ్గించాలి 1
1/1

రొయ్యల ఫీడ్‌ ధరలను తగ్గించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement