మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ

Apr 23 2025 8:31 AM | Updated on Apr 23 2025 8:31 AM

మద్ది

మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ

జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. ముందుగా స్వామి వారిని ఆలయ అర్చకలు ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారికి ప్రభాత సేవ మొదలుకుని, నిత్యకై ంకర్యాలతో విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని ఏలూరు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ సూర్యచంద్రరావు దర్శించుకున్నారు. వారి వెంట లక్కవరం ఎస్సై శశాంక ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,66,246 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌.. రూ.10 వేల జరిమానా

భీమవరం: స్థానిక వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ముద్దాయికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్‌ సీఐ ఎం నాగరాజు మంగళవారం చెప్పారు. పట్టణానికి చెందిన నెలపర్తి ప్రెక్షన్‌ మద్యం సేవించి మోటారుసైకిల్‌ నడుపుతుండగా అదుపులోనికి తీసుకుని భీమవరం స్పెషల్‌ జ్యూడిషల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం హాజరు పర్చారు. ఈ మేరకు మేజిస్ట్రేట్‌ ఎంవీఎన్‌ రాజారావు జరిమానా విధించారని నాగరాజు చెప్పారు.

రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి

భీమడోలు: ధాన్యం సేకరణ లక్ష్యాల పేరుతో రైతులు, కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుండుగొలను, పాతూరు, భీమడోలు తదితర గ్రామాల్లోనిఽ ధాన్యం కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అక్కడ అన్నదాతలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో రైతు పండించిన పంటలో 50 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యాలు నిర్ణయించడం దుర్మార్గమని విమర్శించారు. ధాన్యం లక్ష్యాలు చేరుకోవడంతో ఆరుదల కు వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి లక్ష్యాలతో సంబంధం లేకుండా రైతుల వద్ద నుంచి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బి.నాగేంద్ర, సీహెచ్‌ రమణ, జి.దుర్గారావు, ఎం.శ్రీనివాసరావు, పి.రాము పాల్గొన్నారు.

మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ 1
1/1

మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement