జిల్లా జడ్జికి అభినందనలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జికి అభినందనలు

Apr 22 2025 1:00 AM | Updated on Apr 22 2025 1:00 AM

జిల్ల

జిల్లా జడ్జికి అభినందనలు

ఏలూరు (టూటౌన్‌): జిల్లా ప్రధాన సివిల్‌ న్యాయమూర్తిగా (ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్‌ జడ్జి) పదవీ బాధ్యతలు స్వీకరించిన సిరిపురం శ్రీదేవిని ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆమెకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల న్యాయ అవసరాలు తీర్చేందుకు సంబంధిత విభాగాల మధ్య సమన్వయంతో కేసుల విచారణ, మహిళా భద్రత, నేర నిరోధక చర్యలపై వారు చర్చించారు. పోలీస్‌శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ శివకిషోర్‌ ఆమెకు వివరించారు.

‘ఉపాధి’ బకాయిలు చెల్లించాలి

ఆగిరిపల్లి: ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆగిరిపల్లి మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సత్తు కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూలీలతో కలిసి నిరసన తెలిపారు. మూడు నె లలుగా కూలి డబ్బులు జమ కాలేదని, పని ప్ర దేశాల్లో కనీస సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు.

మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం

బుట్టాయగూడెం: ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ ఆర్డినెన్స్‌ ద్వారా యువతకు న్యాయం చేయాలని, మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అన్నారు. జైనవారిగూడెంలో సోమవారం సంఘ సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ పాడేరులో జరిగిన ఎన్నికల సభలో చంద్రబాబు జీఓ 3కు చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. ఉమ్మ జిల్లా పరిధిలో డీఎస్సీలో 1,035 పోస్టులకు ఎస్టీలకు కేవలం 61 పోస్టు లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు.

జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారిగా శేఖర్‌బాబు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారిగా టి.శేఖర్‌బా బు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ జూని యర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడకు వచ్చిన ఆయన సోమ వారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మంచినీటి చెరువుకు గండి

దెందులూరు: ఏలూరు నగర ప్రజలకు మంచినీటిని అందించే దెందులూరులోని గోదావరి జలాల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు గండి పడింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ కో–ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు వేకువజామున పంపుల చెరువు వద్దకు చేరుకొని యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేతకు పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్‌, మున్సిపల్‌ అధికారులు పనులను పర్యవేక్షించారు. ఫ్లెక్సీలు, ఇ సుక బస్తాలు, మట్టి, రాళ్లతో లీకేజీని అరికట్టేందుకు పనులు చేపట్టారు. రాత్రికి 90 శాతం లీకేజీని అరికట్టినట్టు అధికారులు తెలిపారు.

24 నుంచి ఉపాధ్యాయులకు వైద్య శిబిరం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పూర్వ పశ్చిమగోదా వరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ/స్పెషల్‌ పాయింట్లు పొందాల్సిన వారు వైద్య శిబిరాలకు హాజరుకావాలని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లా జడ్జికి అభినందనలు 
1
1/2

జిల్లా జడ్జికి అభినందనలు

జిల్లా జడ్జికి అభినందనలు 
2
2/2

జిల్లా జడ్జికి అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement