
వాహన దొంగల అరెస్టు
కై కలూరు: వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇరువురు స్థానిక దొంగలను కలిదిండి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్లో రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. పేట కలిదిండికి చెందిన వనమాల జగదీష్(31), కలిదిండికి చెందిన చేబోయిన శ్యాంతేజా(28) ఇటీవల ఈ ప్రాంతంలో 5 వాహనాలను దొంగతనం చేశారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకుని మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విలువ మార్కెట్లో రూ.3.50 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ఏఎస్సై కె.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.రమేష్, డి.వడ్డీ కాసులు, హోంగార్డు కట్టా శ్రీనులను సీఐ రవికుమార్ అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
భీమవరం: మోటారుసైకిల్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ శనివారం చెప్పారు. వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రాజమహేంద్రవరానికి చెందిన ఎం జ్ఞానసాగర్(21) శుక్రవారం రాత్రి తన స్నేహితుడు కె సాయిభరత్తో కలసి గరగపర్రు రోడ్డులోని తన రూమ్ నుంచి మోటారు సైకిల్పై పట్టణంలోకి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్ను తప్పించబోయి అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మోటారుసైకిల్ నడుపుతున్న జ్ఞానసాగర్ తలకు తీవ్ర గాయాలు కాగా సాయిభరత్కు స్వల్పగాయలయ్యాయి. వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా జ్ఞానసాగర్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సాయిభరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇజ్రాయిల్ చెప్పారు.
ప్రేమ పేరిట మోసం.. యువకుడి అరెస్ట్
ఉంగుటూరు: ప్రేమ పేరిట మోసం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలుకు చెందిన పొట్ల పండుబాబు అదే గ్రామానికి చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం పండుబాబు ఆమెను మోసం చేసిన నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పండుబాబును అరెస్ట్ చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.