మహిళలు, చిన్నారుల రక్షణ కోసం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లును రద్దు చేయడం కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి చేతనైతే మరింత బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గం. ఇటువంటి బిల్లును రద్దు చేయడంతో మహిళలకు భరోసా దూరమవుతుంది.
–తానేటి వనిత, మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం ఇన్చార్జి
రద్దు చేయడం దుర్మార్గం
చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలు, యువతులకు రక్షణ కరు వైంది. ఇటువంటి పరిస్థితుల్లో దిశ బిల్లును రద్దు చేయడం దుర్మార్గమైన చర్య. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ విషయంలో చిత్తశుద్ధి లేదనేందుకు ఆ ఘటనే నిదర్శనం.
–జక్కంపూడి విజయలక్ష్మి,
వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు


