నష్టమే వస్తోంది | - | Sakshi
Sakshi News home page

నష్టమే వస్తోంది

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

మార్కెట్లో పొగాకు ధరలు ఇలానే ఉంటే కోలుకోవడం కష్టం. మూడెకరాల దేవస్థానం భూమి కౌలుకు తీసుకుని పొగాకు పంట వేశాం. ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి పెట్టాం. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం కిలో రూ. 275 పలుకుతుంది. ఈ ధరకు పొగాకు అమ్మితే రూ. 5 లక్షల నష్టం వస్తోంది. గత ఏడాది గిట్టుబాటు ధర రావడంతో ఈ ఏడాది అధిక పెట్టుబడి పెట్టి మరీ పంట వేశాను.

– దొడ్డిగర్ల ప్రభాకరరావు, కౌలు రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

కౌలు సొమ్ము రాని పరిస్థితి

మార్కెట్లో పొగాకుకు గిట్టుబాటు ధర లేదు. ఈ ఏడాది అధిక పెట్టుబడి పెట్టి పంట వేశాను. ఎకరాకు రూ. 3.20 లక్షల ఖర్చు అయ్యింది. రెండు బ్యారన్లు రూ. 5 లక్షలు, 8 ఎకరాల భూమి రూ. 5 లక్షలకు అద్దెకు తీసుకుని పంట వేశాను. మార్కెట్లో ధర ఇలాగే ఉంటే సుమారు రూ. 15 లక్షల నష్టం వస్తుంది. ప్రభుత్వం కౌలు కార్డు కూడా ఇవ్వలేదు,. జగనన్న ప్రభుత్వంలో కౌలు కార్డులు ఇచ్చారు. కౌలు సొమ్ము కూడా రాని పరిస్థితి.

– గుమ్మడి శివాజీ, కౌలు రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement