డీఎస్సీ అక్రమాలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్,
పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి
పోరాటం కొనసాగిస్తాం
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకూ పోరాడతాం. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలి. లేకుంటే విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి పోరాడతాం.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్
బాబు పాలనలో
విద్యార్థులకు అన్యాయం
బూటకపు హామీలతో అన్ని వర్గాలనూ చంద్రబాబు మోసం చేశారు. మహానేత వైఎస్సార్ పాలనలో, మాజీ సీఎం జగన్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు.
– తలారి వెంకటరావు, కొవ్వూరు సమన్వయకర్త
రూ.2,160 కోట్ల భృతి బాకీ
ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన సుమారు 3 లక్షల మందికి రూ.2,160 కోట్లు తక్షణం విడుదల చేయాలి.
– జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు సమన్వయకర్త


