● సంబరం.. అంబరం
రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో వేంచేసి ఉన్న వీరభద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో మహా వీరభద్ర సంబరం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇది పుష్కరాల రేవు నుంచి రంగ్రీజుపేట, జెండాపంజా రోడ్డు, లక్ష్మీవారపుపేట, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. వేలాది మంది భక్తులు వీరభద్రుని ప్రతిమలను శిరస్సుపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను ఆలయ ప్రధాన అర్చకులు మేడ బ్రహ్మాజీ పర్యవేక్షించారు.
– ఫొటోలు: గరగ వరప్రసాద్,
సాక్షి, రాజమహేంద్రవరం


