మర్యాద పూర్వకంగా..
రాజమహేంద్రవరం సిటీ: తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో కలసి రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్కు గూడూరి శ్రీనివాస్ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.


