రేపు కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

రేపు కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Apr 20 2025 12:19 AM | Updated on Apr 20 2025 12:19 AM

రేపు

రేపు కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

కాకినాడ లీగల్‌: కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నిక సోమవారం జరగనున్నది. 2025–26 సంవత్సరానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఏలూరి సుబ్రహ్మణ్యం, పి.ప్రసన్నకుమార్‌, ఉపాధ్యక్ష పదవికి పి.రామచంద్రరాజు, ముత్తా వెంకన్న, జనరల్‌ సెక్రటరీగా సీహెచ్‌ వీరభద్రరావు (చంటి), రెడ్డి అన్నవరం, కేవీవీఎస్‌ఎన్‌ మూర్తి, బబిలిశెట్టి సత్యనారాయణ, జాయింట్‌ సెక్రటరీ పదవికి బండి నరేంద్ర, వెలిగొట్ల శ్రీనివాస్‌, కోశాధికారి పదవికి కోకా వెంకట కృష్ణారావు, జి.వెంకట దుర్గాప్రసాద్‌, లైబ్రరీ సెక్రటరీకి మేడపాటి రామారెడ్డి, షేక్‌ అమీర్‌ జానీ, గండికోట కళ్యాణి, స్టోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీగా మంగా వెంకట శివరామకృష్ణ, గింజాల చక్రవర్తి, జోకా వీఎస్‌ విజయకుమార్‌, మహిళ ప్రతినిధి పదవికి జి.దివ్య శ్రీవిద్య, ఎస్‌.స్వర్ణలత, సీనియర్‌ కమిటీ మెంబర్‌కి ఎర్మల్‌ వసంతకుమారి, నక్కా సంజీవ్‌, కమిటీ సభ్యులుగా దుళ్ల నాగబాబు, గుత్తుల మంగరాజు, ఎం.ప్రసాదరావు, మర్ల ప్రవల్లిక, షేక్‌ ప్రేమ్‌నజీర్‌ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్‌ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం 43 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కాకినాడలో క్రిమినల్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన 2021–2022 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2022–23లో కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023–24 ఎన్నికల్లో విజయం సాధించలేదు. తిరిగి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో అభ్యర్థి, సీనియర్‌ న్యాయవాది పి.ప్రసన్నకుమార్‌ 39 సంవత్సరాలుగా క్రిమినల్‌ న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

రెండు పదవులు ఏకగ్రీవం

సూపర్‌ సీనియర్‌ కమిటీ మెంబర్‌గా వేగుళ్ల వెంకట రమణమూర్తి, మహిళా కమిటీ మెంబర్‌గా కె.శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రేపు కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు 1
1/1

రేపు కాకినాడ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement