యువతి అదృశ్యం.. కుబుంబసభ్యుల ఆందోళన

Young Woman Harshini Missing in Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు అర్బన్‌: యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూటౌన్‌ సీఐ యుగంధర్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేటకు చెందిన హర్షిణి(19) బంగారుపాళ్యం వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ చిత్తూరు గాంధీరోడ్డులోని ఓ వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. అయితే బుధవారం ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుబుంబసభ్యులు ఆందోళన చెందారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ తెలిస్తే డయల్‌ –100, 9491074517 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

చదవండి: (ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top