గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి | Young Boy Karthik dead At Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి

Mar 30 2025 1:46 PM | Updated on Mar 30 2025 5:35 PM

Young Boy Karthik dead At Guntur

బాలుడి మేనత్త

సాక్షి, గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. అంతటితో ఆగకుండా పండుగ వేళ ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెంకు చెందిన సాగర్‌ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. సాగర్‌కు ముగ్గురు సంతానం. ముగ్గురిలో కార్తీక్‌, ఆకాష్ కవల పిల్లలు. కొద్ది రోజుల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలను లక్ష్మి తరచూ చిత్రహింసలకు గురిచేస్తోంది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని వారిని ప్రతీరోజు కొడుతూనే ఉండేది.  

ఈ క్రమంలో ఆదివారం దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తీక్‌ను గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు తల పగిలి అక్కడికక్కడేచనిపోయాడు. పెద్ద కుమారుడు ఆకాశ్‌ శరీరంపై రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. దీంతో, ఆకాశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలుడి మరణంతో లక్ష్మి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు.. లక్ష్మిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement