ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తల్లి

Woman Sets Her Two Children On Fire In Kolar Karnataka - Sakshi

సాక్షి, కర్ణాటక: కోలార్‌ జిల్లా ముల్బాగల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు కుమార్తెలపై తల్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

భర్తతో గొడవలు కారణంగా తన ఇద్దరు పిల్లలకు తల్లి జ్యోతి నిప్పంటించింది. తన ఇద్దరు పిల్లలకు ముందుగా నిప్పంటించి.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఘటన స్థలం నుంచి మండుతున్న వాసనను గమనించిన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: ప్రేమపేరుతో టీవీ యాంకర్‌కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్‌కు తీసుకెళ్లి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top