రైలు బోగీలో మహిళపై సామూహిక అత్యాచారం 

Woman Molested Inside Train In Tamilnadu - Sakshi

ఇద్దరు రైల్వే కాంట్రాక్టు కార్మికులు అరెస్ట్‌ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: అలసిసొలసి రైలు బోగీలో ఆదమరిచి నిద్రిస్తున్న మహిళపై ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన 40 ఏళ్ల వివాహిత జీవనాధారం కోసం లోకల్‌ రైలు బోగీలో పళ్లు అమ్ముతుంది. చెంగల్పట్టు–చెన్నై తాంబరం మధ్య తిరిగే లోకల్‌ రైల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మకాలు సాగించి తిరిగి ఇంటికి చేరుకునేందుకు తాంబరంలో చెంగల్పట్టు రైలు ఎక్కింది. (చదవండి: ముక్కలైన ట్రాక్టర్‌.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం)

ఉదయం నుంచి కష్టం చేయడంతో నిద్రపట్టేయగా చెంగల్పట్టు వచ్చినా దిగలేదు. దీంతో అదే రైలు చివరి ట్రిప్పుగా అర్ధరాత్రి వేళ మళ్లీ తాంబరానికి చేరుకుంది. రైలు బోగీలను శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు ఆమెను తట్టిలేపి నోరుగట్టిగా మూసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే రైల్వే సొత్తును చోరీ చేస్తున్నావని కేసులు బనాయిస్తామని బెదిరించారు. శనివారం తెల్లారగానే తాంబరం రైల్వేపోలీసు స్టేషన్‌కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేయగా, కాంట్రాక్టు కార్మికులు సురేష్‌ (31), ఖలీల్‌ (30)లను ఆదివారం అరెస్ట్‌ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు.(చదవండి: పక్కింటి మహిళతో సంబంధం.. సొరంగం తవ్వి మరీ..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top