దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి

Three Young Men Molestation Young Woman In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: అల్లవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. కొమరగిరిపట్నం సముద్రతీరంలో యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో కలిసి వెళ్లిన యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్..
సామూహిక లైంగిక దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌  చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఘటన పై లోతైన దర్యాప్తు జరపాలని డీఎస్పీని కోరారు. గతంలో నిందితులు చేసిన నేరాలపై కూడా దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top