విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి | Three Dead In Train Accident At Medchal Gowdavelli | Sakshi
Sakshi News home page

విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి

Aug 11 2024 6:02 PM | Updated on Aug 11 2024 7:15 PM

Three Dead In Train Accident At Medchal Gowdavelli

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. ఈ ఘటన గౌడవెల్లి రైల్వేస్టేషన్‌ వద్ద జరిగింది.

వివరాల ప్రకారం.. రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ట్రాక్‌ వద్ద పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తన కుమార్తెలను ట్రాక్‌పై కూర్చోబెట్టి కృష్ణ పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో సడెన్‌గా రైలు రావడంతో ట్రాక్‌పై ఉన్న తన పిల్లలను కాపాడేందుకు కృష్ణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిని కాపాడబోయి రైలు తగిలి ముగ్గరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను రాఘవేంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement