అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు | SE Krishna Mohan Comments On Gravel Issue | Sakshi
Sakshi News home page

అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు

Aug 8 2021 6:19 PM | Updated on Aug 8 2021 6:41 PM

SE Krishna Mohan Comments On Gravel Issue - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, నెల్లూరు : గ్రావెల్ అక్రమాలు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఈ కృష్ణమోహన్‌ తెలిపారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలపై కేసుపెట్టామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు. గ్రావెల్ తవ్వకాలు ఆపాలని ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాగుంట శ్రీనివాసులురెడ్డి లేఖ ఇచ్చినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. రిజర్వాయర్‌ కెపాసిటీ పెంచే ఉద్దేశంతోనే మట్టితవ్వకాలు అనుమతిస్తాం. భవిష్యత్తులో ఫొటో ఐడీతో పాటు పూర్తి వివరాలతో అనుమతిస్తాం’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement