-
వైఎస్సార్సీపీ సవాల్,తోక ముడిచి పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
-
అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు
సాక్షి, నెల్లూరు : గ్రావెల్ అక్రమాలు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఈ కృష్ణమోహన్ తెలిపారు. ఉదయ్కుమార్రెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీధర్రెడ్డిలపై కేసుపెట్టామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు. గ్రావెల్ తవ్వకాలు ఆపాలని ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాగుంట శ్రీనివాసులురెడ్డి లేఖ ఇచ్చినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. రిజర్వాయర్ కెపాసిటీ పెంచే ఉద్దేశంతోనే మట్టితవ్వకాలు అనుమతిస్తాం. భవిష్యత్తులో ఫొటో ఐడీతో పాటు పూర్తి వివరాలతో అనుమతిస్తాం’’ అని అన్నారు. -
వందెకరాల్లో దందా
- కేశవరంలో అధికార పార్టీ నేతల కొత్త దందా - పగలు అనుమతి భూముల్లో.. రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు - ఇసుక తరహాలో గ్రావెల్ తవ్వకాలు - ఒకే వే బిల్లుపై పలు ట్రిప్పులు - 100 ఎకరాల్లో - ప్రభుత్వ ఆదాయానికి గండి - ప్రేక్షకపాత్రలో సంబంధితాధికారులు . మండపేట : గ్రావెల్ తవ్వకాల్లో తెలుగు తమ్ముళ్లు సరికొత్త పంధాను తెరపైకి తెచ్చారు. ఇసుక తరహాలో గ్రావెల్ నిల్వలు వేస్తూ అక్రమాలకు కొత్తబాటలు తెరదీస్తున్నారు. పగలు అనుమతి పొందిన భూముల్లో, రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో లక్షలాది రూపాయల గ్రావెల్ను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. . వందెకరాల్లో దందా... సాధారణంగా వరదలు వచ్చే ముందుగా ఇసుకను ఎక్కడికక్కడ అనధికారికంగా నిల్వలు చేసి అమ్మకాలు చేయడం పరిపాటి. ఇప్పుడు గ్రావెల్ తవ్వకాల్లోనూ తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ సరికొత్త విధానానికి మండలంలోని కేశవరంలో మొదలుపెట్టారు. కేశవరంలోని బీటు మెట్ట ప్రాంతంలో పేదలకు పంపిణీ చేసిన, ప్రభుత్వ భూములు దాదాపు వంద ఎకరాలకుపైగా ఉన్నాయి. పట్టా భూములు, ప్రైవేటు స్థలాలను సాగుకు అనుకూలంగా చదును చేయడం పేరిట అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. నిర్ణీత స్థలంలో మెరకను తీసివేసి సాగుకు అనువుగా చదును చేసేందుకు అనుమతులు తెచ్చుకుని దానిమాటున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి వేళల్లో అధికారిక స్థలాల్లో తవ్వకాలు చేస్తూ రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో లక్షలాది రూపాయలు విలువైన గ్రావెల్ను తరలించేస్తున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రోడ్డు పక్కల బెర్ముల వినియోగించే విలువైన పూస గ్రావెల్, ఎర్రమట్టి ఈ భూముల్లో దొరుకుతుండటంతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. ఐదు యూనిట్లు స్థానికంగానే రూ. 4000 వరకు ఉండే ఈ గ్రావెల్, బయటి ప్రాంతాలకు ధరను మరింత పెంచి తరలిస్తుంటారు. డిమాండ్ను బట్టి మిగిలిన గ్రావెల్ను గుట్టలుగా నిల్వ చేస్తుండటం గమనార్హం. గతంలో లీజుకు తీసుకుని తవ్వకాలు పూర్తిచేసిన భూముల్లో ఈ గ్రావెల్ను నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అధికారులు వస్తే ఇంకా తవ్వకాలు చేయాల్సి ఉందని చూపించి వారికి ఎంతోకొంత ముట్టజెప్పి పంపిచేస్తున్నట్టు సమాచారం. పెద్ద ఎత్తున అక్రమంగా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి గ్రావెల్ నిల్వ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోపక్క ఒకే వే బిల్లుపై దూరాన్ని బట్టి రెండు నుంచి ఐదు ట్రిప్పుల వరకు లారీలు పంపిస్తున్నారు. దీనివల్ల సీనరేజీ రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారు. తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ... ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించినప్పటికీ అక్రమ తవ్వకాలు అడ్డంకిగా మారాయి. అక్రమ తవ్వకాలు ద్వారా ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో ఇప్పటికే పెట్రోవర్శిటీ ఈ ప్రాంతం నుంచి తరలిపోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు అక్రమ తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు లారీలను తనిఖీలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి అధికారులు గండిపడకుండా చూడాలంటున్నారు. -
గ్రావెల్ తోలుతున్న వాహనాల పట్టివేత
ఒక జేసీబీ, డోజర్, 10 ట్రాక్టర్లు సీజ్ బర్లగూడెం వద్ద ఇసుకర్యాంపునకు దారి వేస్తుండగా దాడులు పినపాక : అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న వాహనాలను శుక్రవారం రాత్రి ఏడూళ్లబయ్యారం అటవీ క్షేత్ర కార్యాలయ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ట్రైనీ ఐఎఫ్ఎస్, రేంజర్ లక్ష్మణ్రంజి™Œ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పద్మాపురం పంచాయతీ బర్లగూడెం–అల్లేరుగూడెం గ్రామాల మధ్య గల అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ క్వారీ ఏర్పాటు చేసి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ను తరలిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రేంజర్ తన సిబ్బందితో పాటు కరకగూడెం పోలీసుల సహకారంతో అల్లేరుగూడెం అడువుల్లో ఏర్పాటు చేసిన గ్రావెల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. కాగా ముందుగానే అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వాహనాల యజమానులు అక్కడి నుంచి వాహనాలను అటవీ ప్రాంతంలోకి తీసుకవెళ్లి దాచి ఉంచారు. ఈ క్రమంలో రేంజర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా దాచి ఉంచిన ఒక జేసీబీ, ఒక డోజర్ ట్రాక్టర్, 10 ట్రాక్టర్లను అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకొని ఏడూళ్లబయ్యారం రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు.. లక్ష్మణ్రంజిత్నాయక్, ట్రైనీ ఐఎఫ్ఎస్ అల్లేరుగూడెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీకి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రావెల్ను తోలుతున్నట్లు తమ విచారణలో తేలింది. అక్రమంగా తరలించిన గ్రావెల్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డీఎఫ్ఓకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. -
మట్టి..గ్రావెల్ మాఫియా
యథేచ్ఛగా తమిళనాడుకు తరలింపు విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల వ్యాపారం సూళ్లూరుపేట : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చా ఆ పార్టీ నేతలు అలీబాబా 40 దొంగల్లా మారారు. సంపాదనకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చెరువుల్లో మట్టి.. రిజర్వ్ ఫారెస్ట్లోని కొల్లగొట్టే మాఫియాగా మారారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలను చూస్తే వణికిపోతున్నారు. విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నా.. అధికారులు మాత్రం నిస్సాహాయస్థితిలో ఉన్నారు. నీరు–చెట్టు పథకంలో తీసిన మట్టిని రియల్ ఎస్టేట్ల వెంచర్లకు తోలుకుని రెండు వైపులా సొమ్ము చేసుకుంటున్నారు. సూళ్లూరుపేట, తడ మండలాల్లో చెరువుల్లో మట్టి తవ్వేసి చెరువులను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి, గ్రావెల్ను పగలూ, రాత్రి తేడా లేకుండా తరలించడం చూస్తుంటే జాతరలా ఉంది పరిస్థితి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పాముల కాలువ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న టెక్స్టైల్ పార్కుకు తడ మండలంలోని కాదలూరు పెద్ద చెరువు, కొండూరు సోమయాజులు చెరువు, కాశింఖాన్కండ్రిగ చెరువు, చేనిగుంట వడగనేరి చెరువు, తడకండ్రిగ చెరువు, వెండ్లూరుపాడు చెరువు, సూళ్లూరుపేట మండలంలో ఇలుపూరు, మంగళంపాడు చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా మట్టిని తరలిస్తున్నారు. ఆయా చెరువుల్లో మట్టి తీసేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేషీ నుంచి అనుమతులు తీసుకోవడంతో స్థానిక అధికారులెవరూ ఆపే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. ‘ ఊరు మనదే దోచేయ్’ అనే రీతిలో ఆ పార్టీ నేతల పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఎం.జానకి ఇచ్చిన అనుమతిలో చెరువుల్లో పద్ధతి ప్రకారం రెండు నుంచి నాలుగు అడుగుల లోతులో చెరువు అంతా మట్టి తీయాలని ఆదేశాలిచ్చారు. అలా కాకుండా చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడే పెద్ద పెద్ద బావులను తలపించేలా తవ్వేస్తున్నారు. భవిష్యత్లో వానలు తక్కువగా కురిస్తే గుంతల్లోనే నీళ్లు చేరిపోయి తూములు వరకు వచ్చే పరిస్థితులు లేవని రైతులు అందోళన చెందుతున్నారు. రిజర్వు ఫారెస్ట్లో గ్రావెల్ అక్రమ రవాణా చెరువుల్లో మట్టి దోపిడీ చేయడంతో పాటు తడ మండలం మాంబట్టు సమీపంలోని నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్లో గ్రావెల్ను తమిళనాడుకు అక్రమంగా యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంలో నిరుపేద దళితులకు ఇచ్చిన రిజర్వ్ ఫారెస్ట్ భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారే వచ్చి నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతలకు అప్పగించారు. దీంతో వీళ్లు మరో ఓబులాపురం గనుల తరహాలో అయిదారు హిటాచీలు పెట్టి వందలాది టిప్పుర్లతో తమిళనాడుకు గ్రావెల్ను తరలించేస్తున్నారు. మాంబట్టు సెజ్లోని ఆపాచీ కంపెనీ, భారత్ లెదర్ కంపెనీ మధ్యలో డొంకదారిని వెడల్పు చేసి అటవీ శాఖ భూముల్లో రోడ్డు ఏర్పాటు చేసుకుని గ్రావెల్ను పగలు రాత్రి తేడా లేకుండా తరలించేస్తున్నారు. అటవీ ప్రాంతమంతా ఓబులాపురం గనుల తరహాలో సుమారు ఒక తాటిమాను మునిగిపోయేంత లోతుగా తవ్వేసి తరలిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రస్తుతం సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో హైవే మీద వెళ్లాలంటేనే టిప్పర్లు స్పీడ్కు భయపడిపోతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement