ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య 

Mother Assasinate Her Son In Karnataka - Sakshi

సాక్షి, తిరువళ్లూరు(కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.  తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వంభార్య దుర్గ. వీరికి సూర్య(14), శృతి(12), సంతోష్‌(8) అనే ముగ్గురు పిల్లలున్నారు. గత 9న అన్నామలై(17), గోపాలకృష్ణన్‌(21) సూర్యను తీసుకెళ్లి హత్య చేశారు.

సూర్య తాత ఫిర్యాదు మేరకు చోళవరం పోలీసులు గోపాలకృష్ణన్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో సూర్య తల్లిదుర్గకు, గోపాలకృష్ణన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. దుర్గ, గోపాలకృష్ణన్‌ ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్య చూశాడనే కారణంతోనే హత్య చేసినట్లు వెల్లడైంది.  

చదవండి: karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top