చేయి కోసుకొని.. లవర్‌కు వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టి.. | Madhya Pradesh Man Brutally Assassinated In Prakasam District | Sakshi
Sakshi News home page

చేయి కోసుకొని.. లవర్‌కు వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టి..

Apr 7 2021 8:25 AM | Updated on Apr 7 2021 11:15 AM

Madhya Pradesh Man Brutally Assassinated In Prakasam District - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ  

సాక్షి, ప్రకాశం : గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తిమ్మనపాలెం పొలాల్లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దిండోరి జిల్లా మెహెన్‌ద్‌ మండలం సుక్‌లోండి గ్రామానికి చెందిన సంజీవన్‌ (20) ఐదు నెలల నుంచి స్నేహితులతో కలిసి కొరిశపాడు మండలం తిమ్మనపాలెం బీసీ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ మద్దిపాడు గ్రోత్‌ సెంటర్‌ అంజలీ గ్రానైట్స్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పనికి వెళ్లి సోమవారం ఉదయం తిరిగి రూమ్‌కు వచ్చాడు. సోమవారం ఉదయం గది నుంచి బయటకు వచ్చిన సంజీవన్‌ అదే రోజు రాత్రి చేయి కోసుకొని తన ప్రియురాలికి వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టాడు.

మంగళవారం ఉదయం అటుగా గ్రానైట్‌లో పనికి వెళ్తున్న వారికి సంజీవన్‌ రక్తపు మరకలతో రాళ్ల దిబ్బపై మృతి చెంది ఉండటాన్ని గమనించారు. స్నేహితులు (తోటి కూలీలు) మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి మృతదేహం నుంచి గ్రానైట్‌ కంపెనీ వైపునకు పరుగులు తీసింది. క్లూస్‌ టీమ్‌ సభ్యులు మృతదేహంపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. డీఎస్పీ ప్రకాశ్‌రావు, సీఐ ఆంజనేయరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానిక వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement