ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించాలంటూ వెంటపడి మరీ..

Ma Kill Woman By Stabbing Her For Refusing Love - Sakshi

మైసూరు: తన ప్రేమను నిరాకరించిందని ఓ కిరాతకుడు ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన మైసూరు నగరంలోని హెబ్బాల భారత్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆవరణంలో చోటుచేసుకుంది. చామరాజనగర జిల్లా యలందూరుకు చెందిన నంజుండ స్వామి నిందితుడు. వివరాలు.. నర్సు, నంజుండస్వామి ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో నంజుండస్వామి తనను ప్రేమించాలని నర్సుపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె వ్యతిరేకించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం విధుల్లో ఉండగా నంజుండస్వామి చాకుతో గొంతుపై పొడిచాడు. బాధితురాలిని హుటాహుటిన చికిత్సకు తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. 

(చదవండి: కాల్‌’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top