కొంతకాలంగా సహజీవనం.. ఆఫీస్‌కి వచ్చిందని పెట్రోల్‌ తీసుకుని.. | Lover Assassinated Girl Pour Petrol Bengaluru | Sakshi
Sakshi News home page

కొంతకాలంగా సహజీవనం.. ఆఫీస్‌కి వచ్చిందని పెట్రోల్‌ తీసుకుని..

Mar 19 2022 6:51 AM | Updated on Mar 19 2022 11:08 AM

Lover Assassinated Girl Pour Petrol Bengaluru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): పెళ్లి విషయంలో చోటుచేసుకున్న గొడవలో ప్రియురాలిపై ప్రియుడు పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి సోదరి తేజస్విని, శివకుమార్‌పై ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు... బీజాపుర జిల్లాకు చెందిన దానేశ్వరి (23), బాదామికి చెందిన శివకుమార్‌ ఇద్దరు ఇంజనీరింగ్‌ పట్టభద్రులు. ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు బెంగళూరులో లివింగ్‌ టూ గెదర్‌లో ఉన్నారు. (చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. అంతలో మరొకరు ఫోన్‌ చేసి.. )

ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వివాహాన్ని తన కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని శివకుమార్‌ దానేశ్వరి దృష్టికి తెచ్చాడు. దీంతో ఆమె గురువారం శివకుమార్‌ పనిచేస్తున్న కంపెనీ వద్దకు వచ్చింది. అక్కడే ఇద్దరు గొడవపడ్డారు. దీంతో శివకుమార్‌ పెట్రోల్‌ తెచ్చి దానేశ్వరిపై చల్లి నిప్పు పెట్టాడని సోదరి వాపోయింది. శుక్రవారం తెల్లవారుజామున తన సోదిరి మృతి చెందిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement