ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి

At least 36 dead in Taiwan train crash - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు తైవాన్‌లో ఘోర  రైలు ప్రమాదం సంభవించింది. సుమారు 350మందితో  ప్రయాణిస్తున్న రైలు   శుక్రవారం  ఉదయం పట్టాలు తప్పడంతో 36 మంది  ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 72 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే అందోళన వ్యక్తమవుతోంది. అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సరిగ్గా పార్క్ చేయని ట్రక్  ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఈ రైలు హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో పట్టాలు తప్పింది.  సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. సొరంగం మధ్య ఇరుక్కు పోవడం రక్షణ చర్యలు కష్టంగా  ఉన్నాయని పేర్కొన్నాయి.  

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top