నన్‌ మిస్సింగ్‌.. కొన్ని గంటల తర్వాత.. | Kerala Nun Suspicious Deceased In Kerala | Sakshi
Sakshi News home page

నీటి కుంటలో శవమై తేలిన నన్‌

Feb 15 2021 7:21 PM | Updated on Feb 15 2021 7:28 PM

Kerala Nun Suspicious Deceased In Kerala - Sakshi

నన్‌ శవమై కనిపించిన నీటి కుంట

ఆదివారం మధ్యాహ్నం సమయం నుంచి జసీనా కనిపించకుండా పోయింది. దీంతో...

కొచ్చి : అనుమానాస్పద స్థితిలో ఓ నన్‌ మృతి చెందిన ఘటన కేరళలోని కొచ్చిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 44 ఏళ్ల జసీనా థామస్‌ అనే నన్‌ కొచ్చి, వలక్కలకు చెందిన సేయింట్‌ థామస్‌ కాన్వెంట్‌లో ఉంటోంది. ఆమెతో పాటు మరో 12 మంది కూడా ఉంటున్నారు. వీరంతా కొచ్చిలోని వివిధ ప్రదేశాలలో సేవలు చేస్తుంటారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సమయం నుంచి జసీనా కనిపించకుండా పోయింది. దీంతో మిగిలిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( మొబైల్‌ చోరీ.. 3 కి.మీ వెంటాడి సాధించాడు )

ఈ నేపథ్యంలో కొన్ని గంటల తర్వాత కాన్వెంట్‌కు దగ్గరలో ఉన్న ఓ నీటి కుంటలో ఆమె శవం కనిపించింది. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 2018లో కాన్వెంట్‌లో చేరిన సదరు నన్‌ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమె మానసిక పరిస్థితికి, మృతికి సంబంధం ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement