3 కి.మీ వెంటాడి.. చివరకు సాధించాడు

Man Chases Thief For 3 KM And Got Back His Mobile In Chennai - Sakshi

చెన్నై : ఓ వ్యక్తి దొంగతనానికి గురైన తన మొబైల్‌ ఫోన్‌ను దక్కించుకోవటానికి ఏకంగా మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు.  ఆ దొంగకి ముచ్చెమటలు పట్టించడంతో పాటు భయం తెప్పించి చివరకు విజయం సాధించాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత శుక్రవారం చెన్నై పెరుర్‌కు చెందిన పార్తిబన్‌ అనే వ్యక్తి వడ పెరుంబాక్కమ్‌-మాధవరమ్‌ రోడ్‌లో బైక్‌ ఆపి, ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ దొంగ అతడి చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని పరిగెత్తాడు. ( విషాదం: ఇద్దరు పిల్లల్ని హతమార్చి.. ఆత్మహత్య )

పార్తిబన్‌ ఆ దొంగవెంట పడ్డాడు. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ఛేజింగ్‌ సాగింది. దొంగకు అతి చేరువగా వెళ్లగా.. భయపడిపోయిన తస్కరుడు చివరకు ఫోన్‌ను కిందపడేసి పారిపోయాడు. పార్తిబన్‌ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top