ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి | 3 Died Today In Bike And Tractor Accident At Kakinada Tallarevu - Sakshi
Sakshi News home page

Kakinada Road Accident: ఒక బైక్‌పై అతివేగంతో నలుగురి ప్రయాణం.. ప్రమాదంలో ముగ్గురి మృతి

Nov 13 2023 3:33 PM | Updated on Nov 13 2023 4:01 PM

Kakinada Bike Tractor Accident Details - Sakshi

నిర్లక్ష్యంగా బైక్‌పై నలుగురు ప్రయాణించారు.. అదీ అతివేగంతో. ఆ వేగం బైక్‌పై  ఉన్న యువకుల్ని.. 

సాక్షి, క్రైమ్‌: కాకినాడ జిల్లాలో నిర్లక్ష్యం ముగ్గురి జీవితాల్ని బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్‌ సెంటర్‌ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో  వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement