ఏపీ: వెలుగులోకి నకిలీ చలానాల వ్యవహారం

Investigation On Fake Challans At 17 Sub Registrar Offices In AP - Sakshi

17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రూ.5.40 కోట్ల నకిలీ చలానాలు 

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top