కొన్ని రోజులుగా భార్యపై అనుమానం.. నిద్రిస్తున్న సమయంలో
డెంకాడ(విజయనగరం): మండల కేంద్రమైన డెంకాడ గ్రామంలోని యాతవీధిలో తన భార్యపై కత్తితో దాడి చేసిన భర్త ఉందంతమిదీ. డెంకాడ ఎస్ఐ పద్మావతి అందించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న డెంకాడలోని యాతపేటకు చెందిన గొర్లె శ్రీను తన భార్య అచ్చియ్యమ్మపై అనుమానం పెంచుకున్న ఈయన కత్తితో దాడి చేశారని ఎస్ఐ పద్మావతి తెలిపారు.
స్ధానికులు 108కి ఫోన్ చేయడంతో గాయపడిన ఈమెను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి జగదీష్, వీఆర్వో రామారావుల సమక్షంలో నిందితుడు శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెంకాడ ఎస్ఐ పద్మావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: 7నెలలకే భర్త పరార్.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు
సంబంధిత వార్తలు