
హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డు వద్ద మూటలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల పరిధి బ్రహ్మణపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు పడేశారు.
గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.