హిందుస్తాన్‌ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం | Crane Accident At Visakhapatnam Hindustan Shipyard | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్‌ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం

Aug 1 2020 1:20 PM | Updated on Aug 1 2020 7:45 PM

Crane Accident At Visakhapatnam Hindustan Shipyard - Sakshi

సాక్షి, విశాఖపట్నం: హిందూస్తాన్‌ షిప్ ‌యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా క్రేన్‌ కుప్ప​కూలిపోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.

ప్రమాద ఘటనపై మంత్రి అవంతి ఆరా..
షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు

Advertisement
 
Advertisement
Advertisement