TDP Leaders Attacked On YSRCP Leaders Familes With Knives In Chittoor - Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల వీరంగం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

Feb 15 2021 12:08 PM | Updated on Feb 15 2021 3:50 PM

Chittoor TDP Leaders Attacks YSRCP Leaders - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు

సాక్షి, చిత్తూరు: జిల్లాలో టీడీపీ నేతలు కత్తులతో వీరంగం సృష్టించారు. వైస్సార్‌సీపీ కార్యకర్తల కుటుంబాల మీద కత్తులతో దాడులు చేశారు. ఈ ఘటన కేవీ పల్లి మండలం తిమ్మాపురంలో జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన 10 మంది గాయపడ్డారు. దారుణం ఏంటంటే వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 

వివరాలు.. పంచాయితీ ఎన్నికల్లో తిమ్మాపురంలో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలిచాడు. దాంతో బరితెగించిన తెలుగుదేశం నేతలు వైఎస్సార్‌సీపీ శ్రేణుల కుటుంబాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ద్వారక, ఆనంద్‌లతో పాటు మరో 50 మంది ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముద్దుకృష్ణ ఇంటితోపాటు మరో నాలుగు కుటుంబాల మీద దాడులు చేశారు. కత్తులు, ఇనప రాడ్లతో దాడులు చేయడంతో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement