జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్‌ | CBI files chargesheet against Navy commander | Sakshi
Sakshi News home page

జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్‌

Nov 3 2021 5:56 AM | Updated on Nov 3 2021 5:56 AM

CBI files chargesheet against Navy commander - Sakshi

న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా,  రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్‌ 3న తొలి అరెస్ట్‌ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్‌ సింగ్, ఎస్‌జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్‌ రీన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్‌బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా  ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement