అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైన సీఐ | Bodhan CI Nabbed By ACB For Taking Bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

Oct 31 2020 5:24 PM | Updated on Oct 31 2020 7:16 PM

Bodhan CI Nabbed By ACB For Taking Bribe - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ, కానిస్టేబుల్‌ అడ్డంగా బుక్కయ్యారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ భూవివాదంలో రూ. 50 వేలు, ఓ బైకు, రూ.లక్షకు పైగా విలువల చేసే ఫోన్‌ను లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. సాజిద్‌ అనే వ్యక్తి నుంచి ఈ లంచాన్ని డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు..మాటు వేసి సీఐ పల్లె రాకేష్‌ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ గజేంద్ర ద్వారా సీఐ లంచం తెప్పించుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement