లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

Bodhan CI Nabbed By ACB For Taking Bribe - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ, కానిస్టేబుల్‌ అడ్డంగా బుక్కయ్యారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ భూవివాదంలో రూ. 50 వేలు, ఓ బైకు, రూ.లక్షకు పైగా విలువల చేసే ఫోన్‌ను లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. సాజిద్‌ అనే వ్యక్తి నుంచి ఈ లంచాన్ని డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు..మాటు వేసి సీఐ పల్లె రాకేష్‌ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ గజేంద్ర ద్వారా సీఐ లంచం తెప్పించుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top