నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ

ACB Custody Ended In Medak additional Collector Nagesh Case - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో అవినీతి నిరోధక శాఖ కస్టడీ విచారణ ముగిసింది. గత నాలుగు రోజులుగా పాటు విచారించిన ఏసీబీ అధికారులు బినామీల పాత్రపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆరుగురు బినామీలను నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో మెదక్‌తోపాటు హైదరాబాద్ శిర్లలో బినామీల పేర్లతో అస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీరిని ఏసీబీ అధికారుల నుంచి వైద్య పరీక్షలకు తరలించారు. మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలం కీలకం కానుంది. (నగేష్‌ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top