Bus Accident In Karnataka-Kerala Border: పెళ్లి ప్రయాణంలో విషాదం | Wedding Bus Turtles, 7 Dead - Sakshi
Sakshi News home page

పెళ్లి ప్రయాణంలో విషాదం 

Jan 4 2021 10:27 AM | Updated on Jan 4 2021 12:56 PM

7 People Assassinated In Road Accident In Karnataka Kerala Border - Sakshi

ఇంటి మీదకు దూసుకెళ్లి బోల్తా పడిన ప్రైవేటు బస్సు 

బెంగళూరు : కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఆదివారం ఉదయం 11:45 సమయంలో ప్రమాదం జరిగింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని వధువు ఇంటి నుంచి వరుడు, బంధుమిత్రులు సుమారు 60 మంది ఒక ప్రైవేటు బస్సులో కొడగు జిల్లాలోని వరుని ఇంటికి బయల్దేరారు. మధ్యలో కేరళలోని కాసరగోడ్‌ జిల్లా పాణత్తూర్‌ మీదుగా ప్రయాణిస్తుండగా డ్రైవర్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన ఒక పెంకుటిల్లుని ఢీకొన్నాడు. బస్సు వేగంగా బోల్తా కొట్టింది. ( బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌: జైలుకు తరలింపు)

ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు తరువాత చనిపోయారు. గాయపడినవారిని కాసరగోడ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ కొడగు జిల్లాకు చెందినవారేనని తెలిసింది. మృతులు రాజేశ్, రవిచంద్ర, ఆదర్శ్, శ్రేయస్, సుమతి, శశి, జయలక్ష్మీ. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.  ఈ దుర్ఘటనపై కేరళ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement