గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వచ్చి సదరం సర్టిఫికెట్లు సహా దరఖాస్తులను నేరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుత కూటమి పాలనలో దరఖాస్తు చేసుకోవడమే ఒక ప్రహసనంగా మారింది. మంచానికే పరిమితమైన, సరిగ్గా నడవలేని దివ్యాంగులు సైతం ప్రతిరోజూ గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వచ్చిన ప్రతిసారీ సదరం సర్టిఫికెట్ వ్యాలిడిటీ లేదని, ఆధార్ లింక్ కాలేదని, ఆదాయ పరిమితి దాటిందని, కుటుంబ వివరాల్లో తేడాలున్నాయని రకరకాల సాకులు చెబుతూ సిబ్బంది పింఛన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.


