పారిశుద్ధ్యం మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం మెరుగుపడాలి

Dec 23 2025 7:02 AM | Updated on Dec 23 2025 7:02 AM

పారిశుద్ధ్యం మెరుగుపడాలి

పారిశుద్ధ్యం మెరుగుపడాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఎంపీ నిధులతో జీడీ నెల్లూరు మండలానికి 63 లక్షల విలువలతో 20 ఈ ఆటోలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాలకు కూడా ఈ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌, మేయర్‌ అముద, చూడా చైర్‌పర్సన్‌ హేమలత, డీపీఓ సుధాకర్‌ పాల్గొన్నారు.

● ముస్తాబు కార్యక్రమాన్ని సంక్షేమ వసతిగృహాల్లో అమలు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.

● పీజీఆర్‌ఎస్‌ సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలు రీ–ఓపెన్‌ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంపై ఆడిట్‌ జరపాలని ఆదేశించారు. పీఎంవో, సీఎం, మంత్రుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement