
డీఎస్సీ ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభించిందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జ్ డీడీ మునీంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ ప్రారంభ కార్యక్రమాన్విన గురువారం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సహాయం చేసేందుకు ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారని వెల్లడించారు.