Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Published Wed, Oct 4 2023 9:48 AM

today stock market opened red 04 October 2023 - Sakshi

today stock market opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఏ మాత్రం కోలుకోలేదు. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 552 పాయింట్ల నష్టంతో 65,059 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల క్షీణతతో 19,400 వద్ద కొనసాగుతున్నాయి. 

నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీల షేర్లు టాప్‌ లూజర్స్‌ జాబితాలో ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

తప్పక చదవండి

Advertisement