లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market May 14th 2025 Sensex up Nifty at | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు లాభాలు.. కోలుకున్న సూచీలు

May 14 2025 3:50 PM | Updated on May 14 2025 4:07 PM

Stock Market May 14th 2025 Sensex up Nifty at

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నిన్నటి అస్థిర సెషన్ తరువాత, భారత్‌, యూఎస్‌ల నుంచి ఊహించిన దానికంటే మెరుగైన సీపీఐ ద్రవ్యోల్బణ డేటా మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు గ్రీన్‌లో స్థిరపడ్డాయి. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతానికి పడిపోయింది.

బీఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 182.34 పాయింట్లు లేదా  0.22 శాతం పెరిగి 81,330.56 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 కూడా 88.55 పాయింట్లు లేదా 0.36 శాతం లాభపడి 24,666.90 వద్ద ముగిసింది.
 
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 3.95 శాతం, టెక్ మహీంద్రా 2.26 శాతం, ఎటర్నల్ 2.20 శాతం, మారుతీ సుజుకీ 1.66 శాతం, ఇన్ఫోసిస్ 1.52 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ 1.64 శాతం వరకు నష్టపోయాయి.

​కాగా విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.19 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.63 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఎనర్జీ, మీడియా 2.46 శాతం వరకు లాభపడ్డాయి.

నిఫ్టీ ఆటో, హెల్త్ కేర్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ ఎంసీజీ 1 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 0.25 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.23 శాతం నష్టపోయాయి. భారత మార్కెట్లో అస్థిరతను కొలవడానికి ఉపయోగించే ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ 5.61 శాతం క్షీణించి 17.18 పాయింట్లకు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement