సాక్షి మనీ మంత్ర : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు | Stock Market Live News Update | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు

Oct 25 2023 9:55 AM | Updated on Oct 25 2023 10:02 AM

Stock Market Live News Update - Sakshi

ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా వడ్డీరేట్ల పెంచాల్సిందేనన్నఫెడ్‌ నిర్ణయంతో పాటు ఇజ్రాయెల్‌ - హామాస్‌ యుద్ధంతో పాటు వివిధ ప్రతికూల అంశాలు దేశీయ మార్కెట్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకుపోతున్నాయి. 

దీంతో బుధవారం 9.50 గంటల సమయానికి సెన్సెక్స్‌ 139 పాయింట్ల లాభంతో 64711 వద్ద నిఫ్టీ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 19322 వద్ద కొనసాగుతున్నాయి. 

హిందాల్కో, టాటా స్టీల్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, కొటక్‌ మహీంద్రా, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, అపోలో హాస్పిటల్‌, ఇన్ఫోసిస్‌, సిప్లా, ఎన్‌టీపీసీ, దివిస్‌ ల్యాబ్స్‌ ఎథేర్‌ మోటార్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement
Advertisement