48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు.. | Samsung gets over 2 lakh pre orders for latest foldable series within 48 hours of launch in India | Sakshi
Sakshi News home page

48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు..

Jul 20 2025 1:16 PM | Updated on Jul 20 2025 2:49 PM

Samsung gets over 2 lakh pre orders for latest foldable series within 48 hours of launch in India

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సెవెంత్జనరేషన్ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్కోసం భారత్లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9న భారత్లో లాంచ్ అయ్యాయి.

ఇంత భారీ సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు రావడం "బ్రాండ్ ఏడవ తరం ఫోల్డబుల్ కోసం వినియోగదారుల్లో భారీ డిమాండ్, ఉత్సాహాన్ని" సూచిస్తున్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం వచ్చిన ప్రీ-ఆర్డర్లకు ఇది దాదాపు సమానం అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ అయిన మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లను అందుకుంది. మొదటి 48 గంటల్లో, ఎస్ 25, ఫోల్డ్ 7 / ఫ్లిప్ 7 కోసం ప్రీ-ఆర్డర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.89,000 నుంచి రూ.2.11 లక్షల మధ్యలో ఉంది.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.11 లక్షల వరకు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల మధ్యలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ధర రూ.89,000 నుంచి రూ.95,999 వరకు ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ సూపర్ ప్రీమియం కేటగిరీలో అమెరికాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తో పోటీ పడుతోంది.

ఐడీసీ ప్రకారం, భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో ముందంజలో ఉంది. ఇది 2025 తొలి త్రైమాసికంలో 19.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 16.4 శాతం ఎగుమతులతో రెండో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement