త్వరపడండి: శాంసంగ్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..!

Samsung Announces Offers On Smart TVs Refrigerators And More - Sakshi

దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్‌ భారత్‌లో తన వినియోగదారుల కోసం అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్‌ ఉత్పత్తులపై కొత్త శ్రేణి ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 20శాతం మేర క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

శాంసంగ్‌ టీవీలు:
ఎంపిక చేసిన శాంసంగ్‌ చేసిన టీవీలకు కంపెనీ నుంచి ప్రీమియం సౌండ్‌బార్లను ఉచితంగా అందిస్తోంది. ఆఫర్ వ్యవధిలో 75-అంగుళాల అంతకంటే ఎక్కువ QLED టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు 99,990 రూపాయల విలువైన సౌండ్‌బార్ Q900T లేదా QLED TV మోడల్‌ను బట్టి 48,990 రూపాయల విలువైన Q800T సౌండ్‌బార్‌ లభిస్తుంది. వినియోగదారులు ఈ టీవీలను 36 నెలల ఈఎంఐ లభిస్తోంది.అంతేకాకుండా కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.

శాంసంగ్‌ సౌండ్‌ డివైజ్‌స్:
ఎంపిక చేయబడిన శాంసంగ్‌ సౌండ్‌ బార్స్‌పై 10శాతం వరుకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనుంది.

శాంసంగ్‌ ఫ్రిజ్‌లు:
సైడ్‌ బై సైడ్‌, కర్డ్‌ మాస్ట్రో, ఫ్రోస్ట్‌ ఫ్రీ, డైరక్ట్‌ కూల్‌ లాంటి శాంసంగ్‌ ఫ్రీజ్‌ల మోడళ్లను ఈఎంఐతో కొనుగోలు చేస్తే సుమారు 15శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ కాకుండా డిజిటల్‌ కంప్రెసర్‌పై పది సంవత్సరాల వరకు వారంటీని ఇవ్వనుంది.

మైక్రోవేవ్‌ ఓవెన్స్‌:
శాంసంగ్‌ మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ మ్యాగ్‌నెట్రాన్‌ పై 5 సంవత్సరాల వారంటీతో పాటు పది శాతం వరకు క్యాష్‌బ్యాక్‌, సెరమిక్‌ ఎనామిల్‌ కావిటీ మెడల్‌పై పది సంవత్సరాల వారంటీనీ ఇవ్వనుంది.

చదవండి: మార్కెట్‌లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top