సాక్షి మనీ మంత్ర: ఐటీ షేర్లు ఢీలా.. నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు | Sakshi Money Mantra Stock Market Latest | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఐటీ షేర్లు ఢీలా.. నష్టపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు

Nov 24 2023 4:23 PM | Updated on Nov 24 2023 4:24 PM

Sakshi Money Mantra Stock Market Latest

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడిదొడుకులతో చివరికి నష్టపోయాయి. సూచీల నష్టానికి ఐటీ షేర్లే ప్రధాన కారణంగా నిలిచాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసి 65,970 వద్దకు చేరింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,794 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 192 పాయింట్ల లాభంతో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 23 పాయింట్ల లాభంతో సరిపెట్టుకున్నాయి. 

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, దివీస్ ల్యాబోరేటరీస్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్‌ టీ, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

విప్రో, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, బ్రిటానియా, యూపీఎల్, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, బీపీసీఎల్, గ్రాసిమ్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, మారుతీ, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల బాటపట్టాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement