
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 65639వద్ద నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 19566 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఎన్టీపీసీ,హిందాల్కో,యూపీఎల్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లార్సెన్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..ఇన్ఫోసిస్, విప్రో,ఎల్టీఐ మైండ్ ట్రీ, టీసీఎస్,ఏసియన్ పెయింట్స్,హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)