ఎన్‌డీటీవీ ఏజీఎం వాయిదా | Sakshi
Sakshi News home page

ఎన్‌డీటీవీ ఏజీఎం వాయిదా

Published Mon, Aug 29 2022 6:06 AM

NDTV defers its annual meeting by a week amid Adani group takeover - Sakshi

న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ నేపథ్యంలో ఎన్‌డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్‌ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్‌ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్‌ ద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్‌డీటీవీ తెలిపింది.

Advertisement
Advertisement