సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి | Sakshi
Sakshi News home page

సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి

Published Thu, Jun 1 2023 7:25 AM

Micro credit companies need government support - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బడుగు వర్గాల రుణ అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మైక్రోఫైనాన్స్‌ రంగానికి ప్రభుత్వం తగు తోడ్పాటు అందించాలని సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) సమాఖ్య ఎంఫిన్‌ సీఈవో అలోక్‌ మిశ్రా తెలిపారు. ఎంఎఫ్‌ఐలకు రుణ హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐల కోసం ప్రత్యేకంగా రీఫైనాన్స్‌ సదుపాయం కల్పించడం, ఇండియా మైక్రోఫైనాన్స్‌ ఈక్విటీ ఫండ్‌ (ఐఎంఈఎఫ్‌) ద్వారా ఈక్విటీపరమైన సహాయం పెంచడం తదితర రూపాల్లో మద్దతు కల్పించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు.

(ఇదీ చదవండి: అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు)

తద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్‌ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 2021-22 ఇండియా మైక్రోఫైనాన్స్‌ రివ్యూ ప్రకారం 2025-26 నాటికి సూక్ష్మ రుణాల మార్కెట్‌ రూ. 25 లక్షల కోట్లకు చేరవచ్చనే అంచనాలు నెలకొన్నట్లు మిశ్రా చెప్పారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 633 జిల్లాల్లో ఎంఎఫ్‌ఐలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement