Mercedes-Benz India records highest-ever H1 sales at 8,528 units in FY23 - Sakshi
Sakshi News home page

లగ్జరీ కార్ల జోరు : అదీ లెక్క

Jul 12 2023 10:15 AM | Updated on Jul 12 2023 10:30 AM

Mercedes Benz India sells 8528 units in H1 2023  - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ 2023 జనవరి-జూన్‌లో భారత్‌లో 8,528 యూనిట్లను విక్రయించింది.  అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.1.5 కోట్లకుపైగా ధర కలిగిన టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌ (టీఈవీ) వాటా 25 శాతంపైగా నమోదై 2,000 యూనిట్లకు చేరింది. 2022 జనవరి-జూన్‌తో పోలిస్తే టీఈవీల అమ్మకాలు 54 శాతం పెరిగాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

‘ఈ ఏడాది టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌ విభాగంలో అయిదు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. టీఈవీలకు  వెయిటింగ్‌ పీరియడ్‌ 6-24 నెలలు ఉన్నప్పటికీ  విక్రయాలు పెరుగుతున్నాయి. రెండవ అర్ధ భాగంతోపాటు పూర్తి ఏడాదికి మొత్తం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం. నూతన తరం జీఎల్‌సీ మోడల్‌ను మూడవ త్రైమాసికంలో పరిచయం చేస్తున్నాం. పండుగల సీజన్‌కు ముందే ఈ కారు రానుంది’ అని వివరించారు. 2022లో భారత్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి మొత్తం 15,822 యూనిట్లు రోడ్డెక్కాయి. వీటిలో 69 శాతం వృద్ధితో 3,500 పైచిలుకు టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌ ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement